Assam CM : రాహుల్ గాంధీ పాలిటిక్స్ కు ప‌నికిరాడు

సీఎం హిమంత బిస్వా శ‌ర్మ కామెంట్స్

Assam CM : అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ పాలిటిక్స్ కు ప‌నికి రాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కేవ‌లం ట్వీట్లు చేసేందుకు మాత్ర‌మే ప‌నికి వ‌స్తాడ‌ని పేర్కొన్నారు. పార్టీని ఎలా న‌డ‌పాలో, నాయ‌క‌త్వం ఎలా వ‌హించాల‌నే దానిపై ఇంకా అవ‌గాహ‌న లేద‌న్నారు బిస్వా శ‌ర్మ‌(Assam CM).

తాను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) డైనింగ్ రూమ్ లో ఉన్నాన‌ని కాగా కాంగ్రెస్ లో మాత్రం వ‌రండ‌గా వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండేద‌ని మండిప‌డ్డారు అస్సాం సీఎం. ఆయ‌న గ‌తంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ త‌ర్వాత రాహుల్ గాంధీని విభేదించి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. ఊహించ‌ని రీతిలో అస్సాం సీఎంగా కొలువుతీరారు.

రాహుల్ గాంధీ భూస్వామ్య ప్ర‌భువు లాంటి వాడ‌ని అస్సాం సీఎం ఆరోపించారు. ఆయ‌న‌కు పార్టీ అన్నా పాలిటిక్స్ అన్నా సీరియ‌స్ నెస్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయ‌కుడిగా ఏ మాత్రం స‌రి పోద‌న్నారు. ఒక‌సారి నేత‌ల‌తో ముచ్చ‌టిస్తారు. ఆలోపే జాగింగ్ కోసం లేదా వేరే గ‌దిలోకి వెళ‌తారు. రాహుల్ బ‌య‌ట‌కు వ‌చ్చే దాకా వేచి చూడాల్సి ఉంటుందన్నారు అస్సాం సీఎం శ‌ర్మ‌(Assam CM).

ఒక ర‌కంగా చెప్పాలంటే రాహుల్ గాంధీది సామంత రాజు లాగా ఫీల‌వుతాడు. నేటికీ ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు కాదు. కానీ నిర్ణ‌యాల‌న్నీ ఆయ‌న చేతిలోనే ఉంటాయి. పార్టీకి సంబంధించినంత వ‌ర‌కు రాహుల్ గాంధీనే సుప్రీం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు హిమంత బిస్వా శ‌ర్మ‌. ఎవ‌రు పార్టీకి చీఫ్ గా ఎన్నికైనా చివ‌ర‌కు రాహుల్ గాంధీనే సుప్రీం అని పేర్కొన్నారు.

Also Read : రాజ‌స్థాన్ సంక్షోభం టీ కప్పులో తుపాను

Leave A Reply

Your Email Id will not be published!