Sachin Pilot Rahul : రాహుల్ రాజీనామా ఆద‌ర్శ‌నీయం – పైల‌ట్

ప‌ద‌వి కంటే పార్టీ గొప్ప‌ది

Sachin Pilot Rahul : రాహుల్ గాంధీని ప్ర‌శంస‌లతో ముంచెత్తారు రాజస్థాన్ కు చెందిన సీనియ‌ర్ యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్. ప‌ద‌వి కంటే పార్టీ ముఖ్య‌మ‌ని భావించార‌ని అందుకే 2019లో ఏఐసీసీ చీఫ్ ప‌ద‌వికి గుడ్ బై చెప్పార‌ని అన్నారు. త‌మ పార్టీలో రాహుల్ గాంధీ త‌న ప‌ద‌విని త్యాగం చేసి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచార‌ని పేర్కొన్నారు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot).

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ , స‌చిన్ పైల‌ట్ ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. ఇటీవ‌ల రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన స‌మ‌యంలో సీఎం, స‌చిన్ పైల‌ట్ క‌లిసి ప్ర‌యాణం చేశారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ సీఎం, పైల‌ట్ ల‌ను కూర్చోబెట్టి స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్న త‌రుణంలో స‌చిన్ పైల‌ట్ ప్ర‌త్యేకంగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డం పార్టీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది.

రాజ‌స్థాన్ లోని టోంక్ జిల్లా లోని సివిల్ లైన్స్ లో ప్రైవేట్ ఆస్ప‌త్రిని ప్రారంభించారు స‌చిన్ పైల‌ట్ . ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పైల‌ట్ ప్ర‌సంగిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని చెప్పారు. ఓట‌మి త‌ర్వాత త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం రాహుల్ గాంధీ చేసిన గొప్ప ప‌ని అంటూ కితాబు ఇచ్చారు.

Also Read : రాహుల్ యాత్ర‌లో ‘ఊర్మిళ’

Leave A Reply

Your Email Id will not be published!