Champat Rai Rahul Gandhi : రాహుల్ గాంధీ యాత్ర భేష్

రామ మందిరం కార్య‌ద‌ర్శి షాకింగ్ కామెంట్స్

Champat Rai Rahul Gandhi : భార‌త దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాల‌ని కోరుతూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్రను టార్గెట్ చేస్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ప్ర‌స్తుతం రాహుల్ యాత్ర ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొన‌సాగుతోంది. ఈ యాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రామ మందిరం ట్ర‌స్టు కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్(Champat Rai).

బీజేపీ జోడో యాత్ర‌పై నిరంత‌రం దాడికి దిగుతున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి చంప‌త్ రాయ్ సానుకూల ప్ర‌క‌ట‌న చేయ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ఎన్న‌డూ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌ను ఖండించ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

తాము ఎవ‌రి ప‌ట్ల ద్వేష భావంతో ఉండ‌మ‌ని పేర్కొన్నారు చంప‌త్ రాయ్. ఇదిలా ఉండ‌గా రాహుల్ మాట్లాడిన ప్ర‌తిసారి బీజేపీతో పాటు వీహెచ్ఎపీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ , ఆర్ఎస్ఎస్ , ఏబీవీపీ సంస్థ‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. న్యూఢిల్లీలో యాత్ర‌లో భాగంగా హ‌నుమాన్ ఆల‌యంలో పూజ‌లు చేశారు రాహుల్ గాంధీ.

ఇక యూపీలో రాహుల్ గాంధీ జోడో యాత్ర‌కు రామ జ‌న్మ‌భూమి ప్ర‌ధాన పూజాఇ ఆచార్య స‌త్యేంద్ర దాస్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను ప్ర‌శంసించాల‌ని స్ప‌ష్టం చేశారు చంప‌త్ రాయ్(Champat Rai) . రాహుల్ గాంధీ చ‌ర్య‌ను తాను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు.

దేశం కోసం కాలిన‌డ‌క‌న న‌డ‌వ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఈ క‌ఠిన వాతావ‌ర‌ణంలో న‌డుస్తున్నాడు..ఎందుకు అభినందించ కూడ‌ద‌ని పేర్కొన్నారు చంప‌త్ రాయ్.

Also Read : త్రిపుర‌ ఎన్నిక‌లపై టార్చ్ బేర‌ర్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!