Chinna Jeeyar Swamy : రామానుజుడు ఆధ్యాత్మిక విప్ల‌వ‌కారుడు

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి

Chinna Jeeyar Swamy : ఏది త‌ప్పు ఏది ఒప్పు అన్న‌ది త‌ర్కానికి సంబంధించింది. కానీ వెయ్యేళ్ల కింద‌ట ఎలాంటి అవ‌కాశాలు, వ‌న‌రులు లేని స‌మ‌యంలో స‌మాన‌త్వ‌మ‌నే భావ‌న‌ను ఆచ‌రించిన మ‌హానుభావుడు శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యులు.

కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాలు మ‌నుషుల్ని క‌ల్మ‌షం క‌లిగించేలా చేస్తాయి. వాట‌న్నింటికి అతీతంగా ఉండాలంటే ఆధ్మాత్మికత కావాలి. అంత కంటే ఎక్కువ‌గా తోటి వారిని ప్రేమించాలి. దైవం అంద‌రికీ స‌మాన‌మే.

పండితులు, పామ‌రుల‌కు దైవం ఒక్క‌డే. 120 ఏళ్లు బ‌తికిన రామానుజుడు ఎక్కువ కాలం సేవ చేసేందుకే ప్ర‌య‌త్నం చేశాడు. భార‌త దేశం అంత‌టా ప్ర‌యాణం చేశాడు. అన్ని వ‌ర్గాల జీవ‌న విధానాన్ని అర్థం చేసుకున్నారు.

అదే స‌మ‌యంలో వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌పై కూడా దృష్టి పెట్టారు. ఒక ర‌కంగా చెప్పాలంటే శ్రీ రామానుజుడు ఆధ్యాత్మిక విప్ల‌వ‌కారుడు అని చెప్ప‌క త‌ప్ప‌దు. వేద సాహిత్య సంప‌ద‌ను సామాన్యుల ద‌రికి చేర్చాడు.

విశిష్ట‌, ద్వైత‌, అర్హ‌త క‌లిగిన త‌త్వశాస్త్రాన్ని స‌మ‌ర్థించారు. స‌మ‌స్త మాన‌వ కోటి అంతా ఒక్క‌టేన‌ని చాటాడు. భ‌క్తి ఉద్య‌మానికి అధిప‌తిగా, ఇత‌ర భ‌క్తి పాఠ‌శాల‌ల‌న్నింటికీ మూలాధారం అయ్యారు.

క‌బీర్, మీరాబాయి, అన్న‌మాచార్య‌, భ‌క్త రామ‌దాస్ , త్యాగ‌రాజు ఇలా అనేక ఇత‌ర ఆధ్యాత్మిక క‌వుల‌కు ప్రేర‌ణ‌గా నిలిచారు శ్రీ రామానుజుడు. త‌త్వ‌వేత్త, సంఘ సంస్క‌ర్త‌నే కాదు విధ్వాంసుడు కూడా.

వేదాంత సూత్రాల‌పై శ్రీ భాష్యం పేరుతో వివ‌ర‌ణాత్మ‌క వ్యాఖ్యానం రాశారు. గీత భాష్యం, వేదాంత దీప‌, వేదాంత సార‌, శ‌ర‌ణాగ‌తి గ‌ద్య‌, శ్రీ‌రంగ గ‌ద్య‌, శ్రీ వైకుంఠ గ‌ద్య , నిత్య గ్రంథ రాశారు.

స‌మాతావాద ఆలోచ‌న‌కు రామానుజుడు ప్ర‌తీక‌గా నిలిచార‌ని అన్నారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ (Chinna Jeeyar Swamy)స్వామి.

Also Read : శోభాయ‌మానం ఆధ్యాత్మిక సౌర‌భం

Leave A Reply

Your Email Id will not be published!