Rammohan Naidu: సీ.ఎం చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం: మంత్రి రామ్మోహన్‌ నాయుడు

సీ.ఎం చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం: మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Rammohan Naidu: చంద్రబాబు హయాంలోనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బీజం పడిందని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ క్రమంలో అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్‌ సెక్యూరిటీ కల్చర్‌ వీక్‌ నిర్వహించారు. కార్యక్రమంలో రామ్మోహన్‌ నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని చెప్పారు.

Rammohan Naidu Comment

తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి.. భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్రమంత్రి సూచించారు.

Also Read : Botsa Satyanarayana: 12న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ : బొత్స సత్యనారాయణ

Leave A Reply

Your Email Id will not be published!