Shahnawaz Hussain : షానవాజ్ హుస్సేన్ పై రేప్ కేసుకు ఓకే
పిటిషన్ ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
Shahnawaz Hussain : భారతీయ జనతా పార్టీ నాయకుడు షానవాజ్ హుస్సేన్ కు కోలుకోలేని షాక్ తగిలిగింది. ఢిల్లీ హైకోర్టు షానవాజ్ హుస్సేన్ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించింది.
అత్యాచారం (రేప్ ) కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇచ్చింది. 2018లో ఢిల్లీకి చెందిన ఒక మహిళ తన అత్యాచారం ఆరోపణలపై షానవాజ్ హుస్సేన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దిగువ కోర్టును ఆశ్రయించింది.
జూలై 7, 2018న బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేయాలని మెజిస్టీరియల్ కోర్టు ఆదేశించింది. తనపై కేసు నమోదు చేయకుండా ఉండేలా స్టేటస్ కో విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్(Shahnawaz Hussain).
బాధితురాలు కోరింది సమ్మతమేనని కోర్టు భావించింది. ఈ మేరకు హుస్సేన్ కు బిగ్ షాక్ తగిలినట్లయింది. పూర్తిగా ఆయన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
తనపై పోలీస్ కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ట్రయల్ కోర్టు ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ కోర్టును ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి ఆశా మీనన్. ఎఫ్ఐఆర్ ను నమోదు చేయాలంటే 2018 ట్రయల్ ఆర్డర్ లో ఎలాంటి వక్ర బుద్ది తనకు కనిపించ లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుత పిటిషన్ లో ఎటువంటి మెరిట్ లేదు. పిటిషన్ కొట్టి వేశాం. మధ్యంతర ఉత్తర్వులు ఖాళీ చేయబడ్డాయి. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దర్యాప్తు పూర్తి చేసి సెక్షన్ 173 సీఆర్సీ కింద నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
Also Read : నేనింకా షాక్ లోనే ఉన్నా – బిల్కిస్ బానో