Bhagwant Mann : మోడీపై యుద్దానికి సిద్దం – సీఎం మాన్

కేసీఆర్ పోరాటానికి పూర్తి మ‌ద్ధ‌తు

Bhagwant Mann : పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తూ ప్ర‌జాస్వామ్యానికి పాత‌ర పెట్టేందుకు య‌త్నిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఎదుర్కొనేందుకు మ‌న‌మంతా సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు సీఎం(Bhagwant Mann). యావ‌త్ దేశం ఇప్పుడు ప్ర‌మాదంలో ఉంద‌న్నారు.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దారుణంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బుధ‌వారం ఖ‌మ్మంలో జ‌రిగిన భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ఆవిర్భావ స‌భ‌లో భ‌గ‌వంత్ మాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ యుద్దాన్ని స్టార్ట్ చేశాడని, ఆయ‌న‌కు తామంతా అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు సూప‌ర్ అంటూ కితాబు ఇచ్చారు. రైతు బంధు, కంటి వెలుగు , త‌దిత‌ర ప‌థ‌కాలు ఆద‌ర్శ ప్రాయంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు భ‌గ‌వంత్ మాన్(Bhagwant Mann) . దేశంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి చ‌ర్చించుకుంటున్నార‌ని సీఎం కేసీఆర్ ను ప్ర‌శంసించారు సీఎం.

తాను సైతం కంటి వెలుగు కార్య‌క్ర‌మంలో పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఇలాంటి ప‌థ‌కాల‌ను త‌మ రాష్ట్రంలో కూడా అమ‌లు చేసేందుకు ఆలోచిస్తామ‌ని చెప్పారు మాన్. ఇక ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌ల‌ని, వారు త‌లుచుకుంటే ఏ నాయ‌కుడు ఏమీ చేయ‌లేడ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికైనా మోదీ త‌న ప‌రిధిలో తాను ఉంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు సీఎం. మోడీ పాల‌న‌లో ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగి పోతోంద‌ని కానీ మ‌న్ కీ బాత్ పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు సీఎం.

Also Read : నోరు మూసేందుకు లంచం ఇచ్చారు

Leave A Reply

Your Email Id will not be published!