Renuka Chowdhury : మాదే అధికారం మాదే రాజ్యం
సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి
Renuka Chowdhury : ఖమ్మం – మాజీ కేంద్ర మంత్రి , సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి(Renuka Chowdhury) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పక్కాగా తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో 10కి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు.
Renuka Chowdhury Challenge
ఇప్పటి దాకా కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని పోస్టులను భర్తీ చేసిందో చెప్పాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు వాయిదా వేశారో కేసీఆర్ సర్కార్ చెప్పాలన్నారు. జాబ్స్ రాక పోవడంతో యువత తప్పుదోవ పడుతోందన్నారు రేణుకా చౌదరి.
బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు అహంకారంతో విర్ర వీగుతున్నారని వారికి పోయే కాలం దగ్గర పడిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , ఇక ఇంటికి సాగనంపాలని డిసైడ్ అయ్యారని జోష్యం చెప్పారు రేణుకా చౌదరి.
చరిత్ర తిరగ రాసేందుకు తమ పార్టీ రెడీగా ఉందన్నారు. టీడీపీ, సీపీఐ పార్టీలు సైతం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయని ఇక తమను ఆపే సత్తా బీఆర్ఎస్ కు లేదన్నారు.
Also Read : Amit Shah : బీఆర్ఎస్ సర్కార్ బేకార్ – అమిత్ షా