Rishi Sunak Penny : పీఎం రేసులో రిషి సునక్ ముందంజ
రెండో ప్లేస్ లో పెన్నీ మార్టెండ్
Rishi Sunak Penny : యూకే పీఎం రేసులో భారతీయ సంతతి మూలాలు కలిగిన రిషి సునక్(Rishi Sunak) ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్ లో స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించిన రిషి రెండో రౌండ్ లో సైతం సత్తా చాటారు.
అయితే ప్రధాన పోటీదారుగా రెండో ప్లేస్ లో అనూహ్యంగా దూసుకు వచ్చారు ఎన్న మార్డెండ్ . ప్రధాన పోటీదారుగా బరిలో ఉన్న రిషి సునక్ కు 115 మంది టోరీ చట్ట సభ సభ్యుల మద్దతు లభించింది.
పెన్నీ మోర్డాంట్ కు 82 ఓట్లు సాధించగా లిజ్ ట్రస్ కు 71, కెమీ బాడేనోచ్ కు 58 , టామ్ తుగెన్ ధాట్ కు 31 ఓట్లు దక్కాయి. తాజాగా జరిగిన రెండో రౌండ్ ఓటింగ్ లో మాజీ యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్ తన ఆధిక్యాన్ని పెంచుకున్నారు.
ఇదిలా ఉండగా చివరకు నిలిచే ఇద్దరు అభ్యర్థులలో ఒకరిని ప్రధాన మంత్రిగా ఎన్నుకుంటారు. ఎంపీలు వీరికి ఓటు వేస్తారు. విజేతను పార్టీ సభ్యులు నిర్ణయిస్తారు.
ఫస్ట్ రౌండ్ లో స్వల్ప తేడాతో ఉన్న పెన్నీ(Penny) రెండో రౌండ్ లో సైతం గణనీయంగా ఓట్లను పెంచుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికీ ఇంకా రేసు ముగియ లేదు. మరింత రసవత్తరంగా మారనుంది.
పోటీలో ఉన్న వారందరిలో ఇద్దరు మిగిలి మిగతా వారు తప్పుకుని ఎవరో ఒకరికి మద్దతు గనుక ప్రకటించినట్లయితే పోటీ మరింత రసవత్తరంగా మారే ప్రమాదం ఉంది.
అయితే పెన్నీ(Penny) మోర్డాంట్ మరింత కాన్ఫిడెంట్ తో ఉన్నారు.ఇంకో వైపు తన పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్ మాత్రం రిషి షినక్(Rishi Sunak) ను ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవి దక్కకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 5న యూకే పీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read : కష్టాల్లో ఉన్న శ్రీలంకను ఆదుకుంటాం