RSS Leader Indresh Kumar : దర్గాను దర్శించిన ఆర్ఎస్ఎస్ నేత
మత సామరస్యం వెల్లి విరియాలి
RSS Leader Indresh Kumar : దేశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి దాకా ముస్లింలు బీజేపీని అనుమానంగా చూశారు. కానీ గత కొంత కాలంగా ఉగ్రవాదులను ఏరి పారేస్తుండడంతో చాలా మంది ముస్లిం సంఘాలు, పెద్దలు, దర్గాల పూజారులు తమ వైఖరిని మార్చుకున్నారు.
ఈ దేశంలో పుట్టిన తాము భారతీయులమంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో బీజేపీకి చెందిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలో మత పెద్దలను కలిశారు. పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ తరుణంలో తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన ప్రముఖ నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఆదివారం నిజాముద్దీన్ దర్గాను సందర్శించారు.
ఈ సందర్భంగా పూలు, చాదర్ సమర్పించారు. అనంతరం మట్టి దీపాలు వెలిగించారు. అనంతరం ఇంద్రేష్ కుమార్(RSS Leader Indresh Kumar) మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులేనని భేద భావం లేదన్నారు. అంతా కలిసి ఉన్నామని ఇందులో అనుమానం లేదన్నారు.
శాంతి, శ్రేయస్సు, మత సామరస్యతకు దర్గా ఓ చిహ్నమని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకుడు దర్గాను సందర్శించడంతో పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మత పెద్దలు ఆయనకు స్వాగతం పలికారు.
కులం, మతం అన్నది మంచిని పెంచేందుకు ఉన్నాయని ఇదే పెద్దలు , గురువులు ఇప్పటికే బోధించారని తెలిపారు మత పెద్దలు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ నేత దర్గా సందర్శనకు సంబంధించిన ఫోటోలు, వీడియో వైరల్ గా మారింది.
Also Read : కర్ణాటక మంత్రి నిర్వాకం సర్వత్రా ఆగ్రహం