Sachin Pilot Yatra : రాహుల్ యాత్ర‌లో ‘స‌చిన్’ హ‌ల్ చ‌ల్

రాజ‌స్థాన్ లోకి ప్ర‌వేశించిన జోడో యాత్ర

Sachin Pilot Yatra : దేశానికి కావాల్సింది ద్వేషం కాదు ప్రేమ కావాలంటూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఆదివారం రాజ‌స్థాన్ లోకి ప్ర‌వేశించింది. ఈ సంద‌ర్బంగా ఆ రాష్ట్రానికి చెందిన యువ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్(Sachin Pilot Yatra)  సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

ఓ వైపు సీఎం అశోక్ గెహ్లాట్ మ‌రో వైపు స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. ఈ త‌రుణంలో స‌వాళ్ల దాకా వెళ్లింది. ఆపై ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో మ‌ళ్లీ ఒక్క‌ట‌య్యారు. ఈ త‌రుణంలో రాహుల్ గాంధీ స్వ‌యంగా త‌మ రాష్ట్రంలో పాద‌యాత్ర చేస్తుండ‌డంతో అటు సీఎంకు ఇటు పైల‌ట్ కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

ఇవాళ స‌చిన్ పైల‌ట్ అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా ఆయ‌న ప‌రుగులు తీయ‌డం హైలెట్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. భార‌త జాతీయ ప‌తాకంతో ప‌రుగులు తీయ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. 2018లో రాజ‌స్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు.

ప్ర‌ధానంగా స‌చిన్ పైల‌ట్ కు యువ‌త‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న‌తో పాటు పిల్ల‌లు కూడా చేర‌డం మ‌రింత ఉత్సాహాన్ని రేకెత్తించేలా చేసింది. ఇక దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఎన‌లేని బ‌లాన్ని ఇచ్చింది.

మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది యాత్ర‌.

Also Read : విద్వేష రాజ‌కీయాలు ర‌క్షించ‌వు – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!