సమీర్ వాంఖడే , ఎన్సీబీ మాజీ ఎస్పీ విశ్వ విజయ్ సింగ్ , ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆశిష్ రంజన్ , ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు గోసావి, డిసౌజా నిందితులుగా గత వారం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ సోమవారం బయట పడింది. ఆర్యన్ ఖాన్ కేసుకు చెందిన సమీర్ వాంఖడే దేశ భక్తుడిగా తనకు రివార్డ్ ఇస్తున్నట్లు అప్పట్లో పేర్కొన్నాడు.
వాంఖడే బృందం అసలు దాడి సమాచార నివేదికను మార్చిందని ఆరోపించింది సీబీఐ. వ్యక్తుల శోధనకు సంబంధించి డాక్యుమెంట్ చేయలేదని పేర్కొంది. అంతే కాకుండా అనుమానితులను బయట తిరిగేలా అనుమతించారని వెల్లడించింది.
పర్యవేక్షక అధికారి హోదాలో నిందితుడిపై విచారణలో స్వతంత్ర సాక్షులుగా గోసావి, ప్రభాకర్ ఫైల్ ను తీసుకోవాలని ఆదేశించాడు. గోసావిని ఎన్సీబీ కార్యాలయానికి తీసుకు వెళ్లేటప్పుడు నిందితుడిని నిర్వహించేందుకు అనుమతించమని సింగ్ ను ఆదేశించాడు. తద్వారా అతడు అనుమతించాడని తెలిపింది సీబీఐ.
తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను విడిచి పెట్టేందుకు షారుఖ్ ఖాన్ నుంచి రూ. 25 కోట్లు డిమాండ్ చేసే కుట్ర పన్నారు. చివరకు రూ. 18 కోట్లకు డీల్ కుదిరిందని తెలిపింది. టోకెన్ మొత్తం రూ. 50 లక్షలని, దానిని గోసావి తీసుకున్నాడని పేర్కొంది సీబీఐ. నౌకపై దాడి చేశారు. 17 మందిని ఏజెన్సీ అరెస్ట్ చేసింది. మే , 2022లో ఆర్యన్ కు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది.
