Sanjay Raut : ఖ‌ర్గే అన్న‌దాంట్లో త‌ప్పేముంది – రౌత్

శివ‌సేన ఎంపీ బీజేపీపై కామెంట్స్

Sanjay Raut : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut)  షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న ఆ పార్టీకి చెందిన సామ్నా ప‌త్రిక‌కు గౌర‌వ సంపాద‌కులుగా ఉన్నారు. అంతే కాదు ప్ర‌తి వారం వారం కీల‌క‌మైన అంశాల గురించి ప్రస్తావిస్తుంటారు. ఈసారి ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధానంగా బీజేపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి వాడిన కుక్క కామెంట్స్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఇందులో ఖ‌ర్గే అన్న‌దాంట్లో త‌ప్పేమీ లేద‌ని పేర్కొన్నారు. ఈ దేశంలో మ‌తం పేరుతో, కులం, ప్రాంతం పేరుతో విద్వేష పూరిత రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలియ‌దా అని ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్(Sanjay Raut) . ఇదే స‌మ‌యంలో ఆయ‌న నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ పై. ఆమె ఇటీవ‌ల సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఈ దేశంలో ఇద్ద‌రే పితామ‌హులు ఉన్నార‌ని ఒక‌రు ఆనాడు మ‌హాత్మా గాంధీ దేశానికి పితామ‌హుడు అయితే నేటి న‌వ భార‌త జాతికి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీజీ అభిన‌వ పితామ‌హుడు అంటూ కితాబు ఇచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇత‌రుల‌ను కించ ప‌రిచేలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

ఈ దేశాన్ని వ్యాపారులు, కార్పొరేట్ల‌కు గంప గుత్త‌గా అప్ప‌గిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి ఎలా రోల్ మోడ‌ల్ అవుతారంటూ ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్. బీజేపీకి సొంత హీరోలు లేర‌నేది నిజ‌మ‌ని, అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐకాన్ ల‌ను దొంగిలించారంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండ‌గా స్వాతంత్ర ఉద్యమంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కుక్క కూడా చ‌ని పోలేద‌ని ఖ‌ర్గే షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read : గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కొత్త పార్టీ

Leave A Reply

Your Email Id will not be published!