Shahnawaz Hussain : ఓవైసీ కామెంట్స్ పై షాన‌వాజ్ ఫైర్

ముస్లిం స‌మాజాన్ని అవ‌మానించారు

Shahnawaz Hussain :  ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ స‌భ‌లో ముస్లిం స‌మాజం పూర్తిగా నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆపై దేశంలో హిందువుల కంటే ముస్లింలే ఎక్కువ‌గా కండోమ్ లు వాడుతున్నారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ప్ర‌ధానంగా పెరుగుతున్న జ‌నాభా దేశానికి ప్ర‌మాద‌క‌ర‌మంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్ చేసిన వ్యాఖ్య‌లపై స్పందించారు ఓవైసీ. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ముస్లింల జ‌నాభా శాతం త‌గ్గి పోతోందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

కాగా ముస్లింలు ఎక్కువ‌గా కండోమ్ లు వాడుతున్న విష‌యాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్ర‌స్తావించ‌రంటూ ఎద్దేవా చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార ప్ర‌తినిధి షాన‌వాజ్ హుస్సేన్(Shahnawaz Hussain). ఇప్ప‌టి వ‌ర‌కు సామ‌ర‌స్య పూర్వ‌క‌మైన ధోర‌ణితో క‌లిసి మెలిసి ఉంటున్న విడ‌దీసేందుకు ఓవైసీ ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆరోపించారు.

త‌క్కువ జ‌నాభా స‌మాజానికి ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఎక్కువ జ‌నాభా వ‌ల్ల అన‌ర్థాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఆ విష‌యం ఓవైసీ తెలుసు కోలేక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

ఆశించిన మేర ముస్లిం జ‌నాభా పెర‌గ‌డం లేద‌ని అనుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఓవైసీ స‌మాచారం తెలుసు కోకుండా మాట్లాడుతున్నారంటూ షాన‌వాజ్ హుస్సేన్ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ఒక పార్టీకి చీఫ్ గా ఉన్న ఎంపీ ఇలాంటి స‌త్య‌దూర‌మైన మాట‌లు మాట్లాడ‌టం వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు.

Also Read : నితీశ్ భ్ర‌మ‌ల్లో ఉంటూ భ‌య‌ప‌డుతున్నారు

Leave A Reply

Your Email Id will not be published!