Shashi Tharoor : ఢిల్లీ సీఎం తీరుపై శ‌శి థ‌రూర్ సెటైర్ 

క‌వితాత్మ‌కంగా ఫైర్ అయిన కాంగ్రెస్ ఎంపీ 

Shashi Tharoor  : ఢిల్లీ సీం అర‌వింద్ కేజ్రీవాల్ కూర్చున్న తీరు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా అర‌వింద్ కేజ్రీవాల్ చాలా రికాల్స్ డ్ గా త‌న‌కు ఏమీ ప‌ట్ట‌నట్టుగా బిహేవియ‌ర్ ఉందంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు ఆ పార్టీ మీడియా సెల్ నిప్పులు చెరిగింది.

స‌ద‌రు సీఎంకు మ‌ర్యాద తెలియ‌డం లేదంటూ పేర్కొంది. దీనిని ఖండిస్తూ అర‌వింద్ కేజ్రీవాల్ వ్య‌వ‌హారం తో కూడిన వీడియోను నెట్టింట్లో వెంట‌నే షేర్ చేసింది. దేశ మంత‌టా ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

ఎంత ఢిల్లీకి రాజు అయితే మాత్రం ఇలాగేనా ప్ర‌ధానిప‌ట్ల వ్య‌వ‌హ‌రించేది అంటూ నిప్పులు చెరిగారు. ఈ సంద‌ర్భంగా ఓ క్యాప్ష‌న్ కూడా జ‌త చేసింది. అది ఢిల్లీకి మ‌ర్యాద లేని సీఎం అని పేర్కొంది.

దీంతో ఏ మాత్రం సందు దొరికితే చాలు విరుచుకు ప‌డే అల‌వాటు క‌లిగిన ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor )స్పందించారు. దీనిని ఆయ‌న క‌విత రూపంలో వెలువ‌రించారు. 19 సెక‌న్లు నిడివి క‌లిగిన ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ గా మారింది.

పీఎం మోదీ మాట్లాడుతుండ‌గా అర‌వింద్ కేజ్రీవాల్ ఫుల్ రిలాక్స్ డ్ గా ఉన్న‌ట్లు అందులో ఉంది. ఇక శ‌శి థ‌రూర్ అటు బీజేపీని ఇటు ఆప్ ను ఏకి పారేశారు. ఒక‌ప్పుడు ఢిల్లీకి సిఎం ఉండేవారు.

త‌న త‌ల నుంచి కింది వ‌ర‌కు ప‌ద్ద‌తిగా ఉండే వారే. త‌న ఆవేద‌న‌ను బ‌య‌ట పెట్టాడు. బీజేపీ నురుగు , జెల్లీ లాగా విస్త‌రిస్తోందంటూ ఎద్దేవా చేశారు శ‌శి థ‌రూర్ .

Also Read : అఖిలేష్ యాద‌వ్ పై మాయావ‌తి ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!