Shehzad Poonawalla : పూనావాలాకు కాంగ్రెస్ ఆహ్వానం

తాను స్వాగ‌తిస్తున్నాన‌న్న బీజేపీ అగ్ర నేత

Shehzad Poonawalla : భార‌తీయ జ‌న‌త పార్టీకి చెందిన అధికార ప్ర‌తినిధి షెహ‌జాద్ పూనా వాలాకు అనూహ్య‌మైన రీతిలో ఆహ్వానం అందింది. కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌కు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొనాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఆచార్య ప్ర‌మోద్ కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొనాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం షెహ‌జాద్ పూనా వాలా మీడియాతో మాట్లాడారు. తుక్డే తుక్డే గ్యాంగ్ స‌భ్యులు, గో హ‌త్య‌లు, రాముడి ఉనికిని ప్ర‌శ్నించే వారి నుంచి తాను త‌ప్ప‌కుండా భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొంటాన‌ని బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్ షెహ‌జాద్ పూనావాలా(Shehzad Poonawalla)  చెప్పారు.

ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్విటేష‌న్ అందుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. త‌న‌తో పాటు మిగ‌తా పార్టీల‌కు కూడా ఆ పార్టీ ఆహ్వానం ప‌లికింద‌ని వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో రామ మందిరం ట్ర‌స్ట్ కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్ తో పాటు రామ మందిరం ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌తేంద్ర దాస్ కూడా ఏకంగా రాహుల్ గాంధీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

అంతే కాదు ఆయ‌న సుదీర్ఘ లేఖ రాశారు. అందులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశం కోసం , ప్ర‌జ‌ల సంతోషం కోసం రాహుల్ చేప‌ట్టిన యాత్ర విజ‌య‌వంతం కావాల‌ని కోరుతున్నారు. ఆ శ్రీ‌రాముడి ఆశీర్వాదం రాహుల్ పై ఉండాల‌ని కోరిన‌ట్లు తెల‌పారు.

Also Read : రాహుల్ కు రాంమందిర్ పూజారి ప్ర‌శంస‌

Leave A Reply

Your Email Id will not be published!