Snapana Tirumanjanam : తిరుమలలో ముగిసిన పవిత్రోత్సవం
ఘనంగా స్నపన తిరుమంజనం
Snapana Tirumanjanam : పవిత్రమైన పుణ్య క్షేత్రం తిరుమలలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. తిరుమల ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించారు. మంగళవారం ఘనంగా ఉత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం(Snapana Tirumanjanam) నిర్వహించారు.
Snapana Tirumanjanam in Tirumala
ప్రతి ఏటా ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఉత్సవాలను మూడు రోజుల పాటు చేపట్టారు. ఇక ఉత్సవాల ముగింపు సందర్భంగా పూర్ణాహుతి చేపట్టారు. అంతకు ముందు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది.
యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాలు కొనసాగాయి. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జయవిజయులకు, గరుడాళ్వారుకు, వరద రాజ స్వామి వారికి, వకుళమాత అమ్మ వారికి, ఆనంద నిలయం, యాగశాల, విష్వక్సేనుల వారికి, యోగ నరసింహ స్వామి వారికి, భాష్యకార్లకు, పోటు తయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి పవిత్రమాలలు సమర్పించారు
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Onam Festival : దేశ వ్యాప్తంగా ఓనం సంబురం