Srinivas Goud : బీసీల జపం బీజేపీ మోసం
మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
Srinivas Goud : బీజేపీపై నిప్పులు చెరిగారు మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రకటించిన బీజేపీ లిస్టు ను అడ్డం పెట్టుకుని బీసీల జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. లక్ష్మణ్ చేసిన ప్రకటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srinivas Goud Slams BJP
80 కోట్ల జనాభా ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వని దుర్మార్గపు పార్టీ బీజేపీ అని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే అన్ని పార్టీలు ఆ మేరకు సీట్లు ఇస్తాయి కదా. అదెందుకు చేయరని ప్రశ్నించారు మంత్రి.
తెలంగాణ మాదిరిగా మీరెందుకు బీసీల కోసం దేశ వ్యాప్తంగా గురుకులాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని నిలదీశారు. విశ్వ బ్రాహ్మణుడైన దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఓర్వలేక మీ పార్టీ నేతలు గవర్నర్ కు చెప్పి ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ అధ్యక్షున్ని మార్చి ఓసిని అధ్యక్షున్ని చేసిన మీరు… బలహీన వర్గాలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలు ఎన్నికల్లో గెలవలేరని చెప్పే కుట్రతో ఓడిపోయే చోట బీసీలకు సీట్లు కేటాయించారంటూ మండిపడ్డారు.
చట్ట సభల్లో బీసీలు ఉండాలని కోరుకునే పార్టీ BRS మాత్రమే బిజెపి కాదన్నారు. బీసీ అయిన తనకు కేసీఆర్ ఆరు శాఖలు కేటాయించిందని , మరి మీరు కేటాయించ గలరా అని నిలదీశారు.
Also Read : Revanth Reddy : కేసీఆర్ పాలన దోపిడీకి ఆలంబన