Rahul Gandhi : దమ్ముంటే నా యాత్రను ఆపండి – రాహుల్
మరాఠా సర్కార్ కాంగ్రెస్ అగ్ర నేత సవాల్
Rahul Gandhi : మహారాష్ట్రలో రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఉద్రిక్తంగా మారింది. ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త వీడీ సావర్కర్ పై రాహుల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఆయనపై మరాఠా లోని థానేలో కేసు కూడా నమోదైంది.
ఆనాటి స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీ, నెహ్రూకు వెన్ను పోటు పడిచాడని దేశ ద్రోహానికి పాల్పడ్డాంటూ సావర్కర్ ను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర సందర్భంగా అకోలా లో జరిగిన మీడియా సమావేశంలో సావర్కర్ పై నిప్పులు చెరిగారు.
ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే సైతం తీవ్రంగా స్పందించారు. తాము రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను ఒప్పుకోబోమన్నారు.
అయితే ఇదే సమయంలో బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ తో ఎందుకు పొత్తు పెట్టుకున్నదో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. పూణె లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా శుక్రవారం భారత్ జోడో యాత్రను కంటిన్యూ చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .
ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము అనేది ఉంటే తాను చేపట్టిన యాత్రను ఆపాలని సవాల్ విసిరారు. తాను అబద్దం చెప్పలేదని అందుకు తగిన ఆధారాలు ఉన్నాయి గనుక తెలిపానని స్పష్టం చేశారు. దాడులను చూసి బెదిరే ప్రస్తి లేదన్నారు.
Also Read : ఫిరాయింపుదారులు ‘ఊసరవెల్లులు’