Sukesh Chandrasekhar : కేజ్రీవాల్ బండారం బ‌య‌ట పెడ‌తా

సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ తాజా లేఖలో ఫైర్

Sukesh Chandrasekhar : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పై నిప్పులు చెరిగారు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్. గ‌త కొంత కాలంగా కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తున్నారు. నిరంత‌రం లేఖ‌లు విడుద‌ల చేస్తూ మండి ప‌డుతున్నారు. తాజాగా మ‌రో లేఖ‌ను రిలీజ్ చేశారు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్. పౌర సంస్థ‌ల ఎన్నిక‌లు, గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు వ‌చ్చాయో ఆప్ చీఫ్ చెప్పాల‌న్నారు.

ఇదిలా ఉండ‌గా సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్ రూ. 200 కోట్ల రూపాయ‌ల దోపిడీ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం అత‌ను జైలులో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి సినీ న‌టులు నోరా ఫ‌తేహితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను కూడా ప్ర‌శ్నిస్తోంది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ. మీరు నాపై చేస్తూ వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్దాల‌ని పేర్కొన్నాడు.

నేను రాసిన‌వ‌న్నీ స్వంతంగా రాసిన లేఖ‌లేన‌ని తెలిపాడు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్(Sukesh Chandrasekhar). జైల్లో ఉన్న స‌త్యేంద‌ర్ జైన్ , అర‌వింద్ కేజ్రీవాల్ లు మోస‌పూరిత‌మైన వ్య‌క్తుల‌ని ఆరోపించాడు. చౌక‌బారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డేందుకు బీజేపీ మీ లాంటి పార్టీ కాద‌ని స్ప‌ష్టం చేశాడు.

నా అవ‌గాహ‌న ప్ర‌కారం బీజేపీ ఎవ‌రినీ లేదా నన్ను అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. నాకు నేను ఏమిటో తెలుసు. కానీ అర‌వింద్ కేజ్రీవాల్ తేనె పూసిన క‌త్తి. ఆయ‌న అత్యంత మోస‌కారి అని ఆరోపించారు సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్. కేజ్రీవాల్ అబ‌ద్దాల‌ను నిజాలుగా మార్చేలా చేయ‌డంలో సిద్ద హ‌స్తుడ‌ని మండిప‌డ్డారు.

కాగా చంద్ర‌శేఖ‌ర్ చేసిన ఆరోప‌ణ‌లన్నీ అబ‌ద్దాల‌ని, బీజేపీ ఆడుతున్న నాట‌కం అంటోంది ఆప్.

Also Read : క‌ల్తీ మ‌ర‌ణాల‌ను నితీష్ స‌ర్కార్ దాస్తోంది

Leave A Reply

Your Email Id will not be published!