Kanimozhi : ఎంపీ క‌నిమొళికి సుప్రీం ఊర‌ట‌

ఆమె ఎన్నిక స‌వాల్ చేస్తూ కేసు

Kanimozhi : డీఎంకే ఎంపీ క‌నిమొళికి ఊర‌ట ల‌భించింది. గురువారం సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. 2019 ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలుపొంద‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు ర‌ద్దు చేసింది. క‌నిమొళి(Kanimozhi) ఎన్నిక‌ల సంద‌ర్బంగా స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో కుటుంబ ఆస్తుల‌ను వెల్ల‌డించింది. ఇందులో త‌న భ‌ర్త శాశ్వ‌త ఖాతా సంఖ్య (పాన్) ను పేర్కొనడంలో విఫ‌లమైంద‌ని పిటిష‌నర్ దాఖ‌లు చేసిన దావాలో ఆరోపించారు.

పిటిష‌న‌ర్ ఎ.స‌నాత‌న్ కుమార్ అనే ఓట‌రు క‌నిమొళి ఎన్నిక‌ను స‌వాల్ చేశారు. త‌న‌పై వేసిన పిటిష‌న్ ను కొట్టి వేసేందుకు నిరాక‌రించింది మద్రాస్ హైకోర్టు. దీంతో ఎంపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేశారు. ఆపై ఉన్న‌త స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

ఇదిలా ఉండ‌గా 2019లో త‌మిళ‌నాడులోని తూత్తుకుడి నియోజ‌క‌వ‌ర్గం నుండి డీఎంకే ఎంపీ క‌నిమొళి(Kanimozhi) ఎన్నిక‌ను స‌వాల్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. ఇవాళ దానిని పూర్తిగా కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న‌పై దాఖ‌లైన పిటిష‌న్ ను కొట్టి వేసేందుకు నిరాక‌రించిన మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాల‌ను క‌నిమొళి స‌వాల్ వేశారు.

దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తులు అజ‌య్ ర‌స్తోగి, బేల ఎం. త్రివేదిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం గురువారం కీల‌క తీర్పు వెలువ‌రించింది.

Also Read : బేటీ బ‌చావో అనేది ఓ వంచ‌న – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!