Supreme Court Congress : కాంగ్రెస్ కు ఊర‌ట పిటిష‌న్ కొట్టివేత‌

2019 పార్టీ మేనిఫెస్టో అన్యాయ‌మ‌ని దాఖ‌లు

Supreme Court Congress : కాంగ్రెస్ పార్టీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీకి సంబంధించి 2019లో త‌యారు చేసిన మేనిఫెస్టో పూర్తిగా అన్యాయ‌మ‌ని దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మోసం జ‌రిగిందంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను సోమ‌వారం సుప్రీంకోర్టు(Supreme Court Congress) కొట్టి వేసింది. ఇది పూర్తిగా నిరాధార‌మ‌ని పేర్కొంది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ , పీఎస్ న‌ర‌సింహ , జేబీ పార్థివాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది.

దాఖ‌లైన పిటిష‌న్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా అన్యాయ‌మ‌ని, మోడ‌ల్ ప్ర‌వ‌ర్తనా నియ‌మావ‌ళికి విరుద్దంగా ఉంద‌ని పేర్కొంది. వెంట‌నే దానిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు దావాలో. ఈ పిటిషన్ లో ఎటువంటి అర్హ‌త లేద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం.

పార్టీపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌డం హాస్యాస్పదంగా ఉంద‌ని అభిప్రాయ ప‌డింది. ఇలాంటి పిటిష‌న్ల వ‌ల్ల కోర్టుకు సంబంధించిన విలువైన స‌మ‌యం వృధా అవుతోంద‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. ప్ర‌స్తుతం త్వ‌ర‌లో దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు సంద‌డి చేయ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఆయా పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో త‌మ ఉనికి చాటు కునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

కాంగ్రెస్ ఎలాగైనా ప‌వ‌ర్ లోకి రావాల‌ని అనుకుంటోంది. మ‌రోవైపు మోదీ నేతృత్వంలోని బీజేపీ తామే ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని బీరాలు ప‌లుకుతోంది. మొత్తంగా పోటా పోటీగా ఆయా పార్టీలు మేనిఫెస్టోలు ప్ర‌క‌టిస్తూ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాయ‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాయి.

Also Read : వివేక్ అగ్నిహోత్రిపై కోర్టు సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!