Telangana DGP : తెలంగాణ డీజీపీతో ఐబీ చీఫ్ భేటీ
ఎన్నికల సందర్భంగా కీలక చర్చలు
Telangana DGP : తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్(Telangana DGP) తో గురువారం ఐబీ చీఫ్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండు గంటలకు పైగా సాగింది. ఎన్నికల నిర్వహణ , అధికారుల మార్చడంపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు సమాచారం.
Telangana DGP and IG Meeting
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీకి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున ఐపీఎస్ , ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ కు , బృందానికి ఫిర్యాదు చేశాయి.
ప్రజలకు సేవలు అందించాల్సిన ఉన్నతాధికారులు బీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ ఆరోపణలు చేశారు నేతలు. అంతే కాదు భారీ ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ జరిగిందని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ రంగంలోకి దిగింది. వెంటనే బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో 25 మందికి పైగా స్థాన చలనం కలిగింది. వారిలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కూడా ఉన్నారు. చాలా చోట్ల గులాబీ ముద్ర పడింది వీరిపై. ఇక కలెక్టర్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
Also Read : komatireddy Venkat Reddy : గెలుపు ఖాయం నేనే సీఎం