Aditya Thackeray : ఆ ఆరోపణలు అబద్దం – ఆదిత్యా ఠాక్రే
కావాలని బద్నాం చేస్తున్నారని ఫైర్
Aditya Thackeray : ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ గా పని చేసిన బాలీవుడ్ ఏజెంట్ దిశా సాలియన్ మరణం వెనుక మాజీ మంత్రి, శివసేన పార్టీ యువ నాయుడు ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన తిరుగుబాటు షిండే వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు లేవనెత్తారు.
దీనిపై సీరియస్ గా స్పందించారు ఆదిత్యా ఠాక్రే. దిశా సాలియన్ కు తనకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. అయితే బీజేపీ నాయకులు మాజీ మంత్రికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దిశా సాలియన్ జూన్ 8, 2020న 14వ అంతస్తు నుంచి పడి సూసైడ్ చేసుకుంది.
ఒక వారం రోజుల తర్వాత జూన్ 15న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసేలా చేసింది. ఇదిలా ఉండగా దిశా సాలియన్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటిచారు.
ఎవరైనా సాక్ష్యాధారాలు ఇవ్వాలని అనుకుంటే సిట్ కు అందజేయాలని కూడా కోరారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా మంగళవారం ఏక్ నాథ్ షిండే పార్టీకి చెందిన ఎంపీలు లోక్ సభలో దిశా సాలియన్ అంశాన్ని లేవనెత్తారు. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
దీంతో సోషల్ మీడియాలో ఆదిత్యా ఠాక్రే హాట్ టాపిక్ గా మారారు. దీనిపై స్పందించిన ఆయన ఎన్ని సిట్ లు వేసుకున్నా ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
Also Read : ముదిరిన వివాదం అసెంబ్లీలో తీర్మానం