Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.30 కోట్లు
దర్శించుకున్న భక్తులు 65,422
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీతో ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది.
Tirumala Hundi Updates
ఇదిలా ఉండగా శ్రీవారిని 65 వేల 422 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 778 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు. ఇక నిత్యం భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.30 కోట్లు వచ్చినట్లు ఈవో స్పష్టం చేశారు.
స్వామి వారి దర్శనం కోసం తిరుమల లోని 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని , ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Also Read : Minister KTR : కాంగ్రెస్ ను నమ్మితే నట్టేట మునిగినట్టే