Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.06 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రమైన తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల గిరులు భక్తులతో నిండి పోయాయి. గోవిందా గోవిందా , అనాధ రక్షక గోవిందా, ఆపద మొక్కుల వాడా గోవిందా అంటూ గోవింద నామ స్మరణతో భక్తులు హోరెత్తించారు.
తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 71 వేల 132 మంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి 26 వేల 963 మంది తల నీలాలు సమర్పించుకున్నారు.
Tirumala Rush with Devotees
భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈసారి స్వామి వారికి రూ. 4.06 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమల లోని 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారని తెలిపింది. ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 14 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తిరుమల పుణ్య క్షేత్రానికి తరలి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను సకల ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
సామాన్యులకు దర్శన విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : Nara Lokesh : మూడు రాజధానుల ఊసెత్తని జగన్