Top Aircraft Accidents: భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాల గురించి తెలుసా
భారత్ లో జరిగిన భారీ విమాన ప్రమాదాల గురించి తెలుసా
Top Aircraft Accidents : గుజరాత్ అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ బోయింగ్ 787-7 డ్రీమ్ లైనర్ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విమానం ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ అనే ప్రయాణీకుడు తప్ప 241 మంది ప్రయాణికులు, 10 సిబ్బంది, ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే గత ఐదేళ్లలో భారత్ (India) లో జరిగిన విమానాల ప్రమాదాల్లో ఇది భారీదని నిపుణులు భావిస్తున్నారు. గతంలో జరిగిన భారీ విమాన ప్రమాదాల విషయానికి వస్తే…
Top Aircraft Accidents in India
2020 కరోనా మహమ్మారి సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపుతప్పింది. 30 అడుగుల లోయలో పడి విమానం రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్ల సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా (Air India) ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1998 జులైలో ఆలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-2A8 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న పాంత్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బిహార్లోని పట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
1996 హరియాణాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం 763, కజికిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణం ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో 340కి పైగా మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు.
1993 ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, సిబ్బంది 55 (గ్రౌండ్ సిబ్బందితో కలిపి) ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన 1990 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. నాడు ఈ ప్రమాదంలో 146 ప్రమాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు.
Also Read : Viswas Kumar Ramesh: ఎయిరిండియా విమాన ప్రమాదం నుండి బయటపడిన మృత్యుంజయుడు