Mallikarjun Kharge : ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమ‌లు చేస్తా

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కీల‌క కామెంట్స్

Mallikarjun Kharge :  కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు పోటీగా ఎంపీ శ‌శి థ‌రూర్ ఉన్నారు. ఇద్ద‌రూ పోటా పోటీగా దేశ వ్యాప్తంగా ప్ర‌చారంలో బిజీగా మారి పోయారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూనే గెలిపిస్తే తాము ఏం చేస్తామ‌నేది ముందుగానే ప్ర‌క‌టిస్తున్నారు.

శ‌శి థ‌రూర్ పార్టీలో హైక‌మాండ్ క‌ల్చ‌ర్ ను మార్చేస్తానంటూ స్ప‌ష్టం చేశారు. తాజాగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. తాను గ‌నుక గెలిస్తే రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్ల‌రేష‌న్ ను క‌చ్చితంగా అమ‌లు చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

స‌మిష్టి నాయ‌క‌త్వం, సంప్ర‌దింపుల ప్ర‌క్రియ‌పై త‌న‌కు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌న్నారు. యువ‌త‌, రైతులు, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే(Mallikarjun Kharge). ఆయ‌న తాజాగా మీడియాతో మాట్లాడారు. చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేస్తాన‌ని ఖ‌ర్గే చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది మే నెల‌లో ఉద‌య్ పూర్ లో పార్టీ చింత‌న్ శివ‌ర్ – మేధోమ‌థ‌న స‌మావేశం ఏర్పాటు చేసింది. సంస్థాగ‌త సంస్క‌ర‌ణల్లో ఒక‌టి ఒకే వ్య‌క్తి ఒకే ప‌ద‌వి అనే సూత్రం. ఎన్నిక‌ల టికెట్ల పంపిణీ , ఆఫీస్ బేర‌ర్ల ప‌ద‌వీ కాలానికి సంబంధించిన ఇత‌ర ప్ర‌తిపాద‌న‌లు స‌మావేశంలో ఆమోదించ‌బ‌డ్డాయి. త‌న‌ను ఆహ్వానించిన కాంగ్రెస్ ప్ర‌తినిధుల‌తో సంభాషించేందుకు ఖ‌ర్గే ముంబైకి వ‌చ్చారు.

Also Read : ఉద్ద‌వ్ ఠాక్రే..ఏక్ నాథ్ షిండేకు ఈసీ షాక్

Leave A Reply

Your Email Id will not be published!