Uma Bharti Rahul : రాహుల్ పై ఉమా భార‌తి సెటైర్

ద‌మ్ముంటే పీఓకేలో యాత్ర చేప‌ట్టు

Uma Bharti Rahul : మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం, బీజేపీ సీనియ‌ర్ నేత ఉమా భార‌తి షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు రాహుల్ గాంధీ ప్ర‌య‌త్నం చేస్తున్నాడంటూ నిప్పులు చెరిగారు. ఆయ‌న‌కు ద‌మ్ముంటే పాకిస్తాన్ ఆక్ర‌మిత కాశ్మీర్ (పీఓకే)లో భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాల‌ని స‌వాల్ విసిరారు.

ఒక‌వేళ కాద‌నుకుంటే అక్క‌డే ఉండాల‌ని ఎద్దేవా చేశారు. దేశాన్ని ఏకం చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు ఉమా భార‌తి(Uma Bharti) . దేశం ఎప్ప‌టి నుంచో ఏకత్వంతోనే ఉంద‌న్నారు. త‌న భావ‌జాలం మార్చు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచించారు రాహుల్ గాంధీకి. బితుల్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు ఉమా భార‌తి.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజ‌కీయాలు ఎవ‌రు చేస్తున్నారో, ఎవ‌రు ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేష‌పు బీజాలు నాటుతున్నారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఆయ‌న ఎందుకోసం యాత్ర చేప‌డుతున్నారో త‌న‌కే తెలియ‌ద‌ని మండిప‌డ్డారు ఉమాభార‌తి(Uma Bharti) . ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ మాత్రం ప్ర‌ధాన‌మంత్రి మోదీని, బీజేపీని, దాని అనుబంధ సంస్థ‌ల‌ను ఏకి పారేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే మొద‌ట లైట్ గా తీసుకున్న బీజేపీ ఇప్పుడు పొద్ద‌స్త‌మానం రాహుల్ గాంధీని విమ‌ర్శించేందుకు టైం కేటాయిస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాహుల్ యాత్ర‌కు స్పంద‌న ల‌భిస్తోంది. ఇత‌ర రంగాల‌కు చెందిన వారు కూడా ఆయ‌న‌తో జ‌త క‌లుస్తున్నారు. ఇది కాషాయ శ్రేణుల‌ను క‌దిలించేలా చేస్తోంది. ఇవాల్టి నుంచి రాహుల్ తిరిగి యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.

Also Read : రాహుల్ ఆహ్వానం అఖిలేష్ సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!