John Barla : కేంద్ర మంత్రి ధిక్కారం కోర్టు ఆగ్రహం
వెంటనే జాన్ బార్లాను అరెస్ట్ చేయాలి
John Barla : అధికారం తమ చేతుల్లో ఉంటే ఏమైనా చేయొచ్చు అన్నది ఇప్పుడు పొలిటికల్ లీడర్లకు రివాజుగా మారింది. చోరీలు, నేరాలు, ఘోరాలు, మోసాలకు పాల్పడుతున్న వారంతా రాజకీయాల్లో కొనసాగుతుండడం విస్తు పోయేలా చేస్తోంది. చట్టాలలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని యధేశ్చగా పొలిటికల్ లీడర్లు, పాలకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
విద్వేషాలు రెచ్చగొడుతూ సమాజాన్ని మరింత నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు మతం మనుషుల మధ్య సత్ సంబంధాలను పెంపొందించేది. కానీ ఇవాళ మతం రాజకీయం చేస్తోంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఇద్దరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.
ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా వాళ్లు స్పందించలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ కు చెందిన కోర్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ఇద్దరికి అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దొంగతనం కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన 48 గంటల తర్వాత మరో కేంద్ర మంత్రి జాన్ బార్లాకు(John Barla) షాక్ ఇచ్చింది.
ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ 2019 ఏప్రిల్ 4న తుపాన్ గంజ్ లో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జాన్ బార్లా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఆయన పర్మిషన్ తీసుకోక పోవడంతో కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించి తుఫాన్ గంజ్ సబ్ డివిజన్ కోర్టు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదు. నవంబర్ 15న మరోసారి స్పష్టం చేసినా రాక పోవడంతో జాన్ బార్లాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Also Read : అరుణాచల్ ప్రదేశ్ లో ఎయిర్ పోర్ట్ రెడీ