V Srinivas Goud : బండి జ‌ర భ‌ద్రం మంత్రి ఆగ్ర‌హం

అభివృద్ధిపై మాట్లాడు నోరు పారేసుకోవ‌ద్దు

V Srinivas Goud : నోరు అదుపులో పెట్టుకోక పోతే నాలుక చీరేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్(V Srinivas Goud) బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ కు. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ లేక పోతే తెలంగాణ వ‌చ్చేదే కాదు. ఉద్య‌మం జ‌రిగిన స‌మ‌యంలో నువ్వు ఏడున్నావో ఎవ‌రికైనా తెలుసా అని ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

గ‌తంలో ఎంద‌రో బీజేపీకి అధ్య‌క్షులుగా ప‌ని చేశార‌ని కానీ ఇలాంటి చౌక‌బారుత‌నంతో ఎప్పుడూ మాట్లాడ లేద‌న్నారు. ద‌మ్ముంటే అభివృద్ధిపై మాట్లాడాల‌ని కానీ వ్య‌క్తిగ‌తంగా ఆరోప‌ణ‌లు చేస్తామంటూ ఊరుకోబోమ‌న్నారు.

కేసీఆర్ ఉన్నంత వ‌ర‌కు ఆయ‌న‌ను ఓడించే శ‌క్తి ఇంకెవ్వ‌రికీ లేద‌న్నారు. సీఎంను, మంత్రుల‌ను వాడు వీడు అంటే ఊరుకోమని హెచ్చ‌రించారు. పాద‌యాత్ర‌ల పేరుతో ప్ర‌శాంతంగా ఉన్న పాల‌మూరులో చిచ్చు పెడుతున్నారంటూ మండిప‌డ్డారు.

2000లో మూడు రాష్ట్రాలు ఏర్ప‌డిన స‌మ‌యంలో తెలంగాణ ఇవ్వ‌కుండా బీజేపీ మోసం చేసిందంటూ గౌడ్(V Srinivas Goud) ఆరోపించారు. ఏ మాత్రం సిగ్గు, ల‌జ్జ లేకుండా బీజేపీ నేత‌లు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు .

సంజ‌య్ నువ్వు ఎవ‌రు ఇంత‌కు. నీకు ఏం హ‌క్కు ఉంది తెలంగాణ‌పై మాట్లాడేందుకు అని మంత్రి ప్ర‌శ్నించారు. జేపీ న‌డ్డా క‌నీసం అవ‌గాహ‌న లేకుండా మాట్లాడారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

బీజేపీ దేశం పాలిట ఏటీఎం అయ్యింద‌న్నారు. ఆదానీ తొత్తు మోదీ అన్నారు. ఇంకోసారి సోయి త‌ప్పి మాట్లాడితే చూస్తూ ఊరుకోమ‌ని, నాలుక లేకుండా చేస్తామ‌న్నారు గౌడ్.

 

Also Read :   భారీ వ‌ర్షం త‌ల్ల‌డిల్లిన భాగ్య‌న‌గ‌రం

Leave A Reply

Your Email Id will not be published!