Vijay Sai Reddy : బాబు ప‌ని ఖ‌తం ఓట‌మి ఖాయం

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి

Vijay Sai Reddy : వైఎస్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య సాయి రెడ్డి(Vijay Sai Reddy) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏపీలోని విజ‌య‌వాడ – గుంటూరు జాతీయ ర‌హ‌దారికి సమీపంలోని నాగార్జున యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణ‌లో వైసీపీ మూడో ప్లీన‌రీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.

లక్ష‌లాదిగా జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. జ‌న‌సంద్రంతో ఆ ప్రాంగ‌ణం నిండి పోయింది. ఈ సంద‌ర్భంగా ఎంపీ విజ‌య సాయి రెడ్డి శ‌నివారం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్లీన‌రీ బ‌హిరంగ స‌భ కాద‌ని ఇది ప్ర‌తినిధుల స‌భ అని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా 68 వేల మంది కార్య‌క‌ర్త‌లు ప్లీన‌రీకి హాజ‌రయ్యార‌ని చెప్పారు విజ‌య సాయి రెడ్డి. ఇవాళ నాలుగున్న‌ర ల‌క్ష‌ల‌కు పైగా హాజ‌రు కానున్నార‌ని వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించి అధికార దుర్వినియోగం అన్న‌ది ఎక్క‌డా జ‌ర‌గ‌లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు విజ‌య సాయి రెడ్డి. ఆయ‌న‌కు మ‌తి చెడింది. పిచ్చి పిచ్చిగా అర్థం ప‌ర్థం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో ఇప్ప‌టికే టీడీపీ అడ్ర‌స్ లేకుండా పోయింద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డ పోటీ చేసినా ఓడి పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు విజ‌య సాయి రెడ్డి.

175 స్థానాల‌కు గాను తాము అన్నింటిని గెలుచుకుని తీరుతామ‌ని అన్నారు ఎంపీ. 25 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుదేన‌ని ఎద్దేవా చేశారు.

Also Read : బిడ్డ ప్ర‌చారానికి త‌ల్లి ర‌థ‌సార‌థి

Leave A Reply

Your Email Id will not be published!