Virat Kohli : కోహ్లీ ‘జో వాదా కియా’ సాంగ్ వైర‌ల్

ఆట‌గాడే కాదు పాట‌గాడు కూడా

Virat Kohli : విరాట్ కోహ్లీ గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్యుత్త‌మ‌మైన క్రికెట‌ర్ గా పేరొందాడు కోహ్లీ. ఇప్ప‌టికే అన్ని ఫార్మాట్ ల‌లో ఎన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. మ‌రెన్నో ప‌రుగులు సాధించాడు.

ఇక కెప్టెన్ గా భార‌త జ‌ట్టుకు ఏడేళ్ల‌కు పైగా వ్య‌వ‌హ‌రించి ఎనలేని విజ‌యాలు సాధించి పెట్టాడు. కోహ్లీ మైదానంలో స్పీడ్ గా ఉంటాడు. అంతే కాదు ఓట‌మిని ఒప్పుకోడు. విక్ట‌రీ సాధించే దాకా ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు.

స్టేడియం వెనుకాల చాలా జోవియ‌ల్ గా ఉంటాడు. మాట‌లే కాదు మంచి స్నేహితుడిగా, కుటుంబంలో స‌భ్యుడిగా మారి పోతాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే కోహ్లీ గొప్ప ప్రేమికుడు.

అంతే కాదు అత‌డికి క్రికెట్ అంటే ఎంత ఇష్ట‌మో అంతే స్థాయిలో త‌న‌కు పాట‌లు విన‌డమే కాదు పాడ‌టం ఇష్టం కూడా. ఇటీవ‌లే ప్ర‌పంచ దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ లోకాన్ని వీడారు.

ఈ సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికీ ఆమె పాడిన పాట‌ల‌ను స్మ‌రించు కుంటోంది. ఈ త‌రుణంలో భార‌త క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) త‌న‌కు ఇష్ట‌మైన పాట‌ల‌ను పాడటం మామూలే.

అయితే దిగ్గ‌జ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ పాడిన జో వాధా కియాతో నిభానా ప‌డేగా అన్న పాట‌ను కోహ్లీ, హ‌మీదా అనే సింగ‌ర్ తో క‌లిసి పాడాడు. ల‌తాజీ ఇప్పుడు లేక పోవ‌డం..విరాట్ (Virat Kohli)పాడిన ఆ సాంగ్ నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

మాట్లాడేందుకు కొంత మొహ‌మాట ప‌డే కోహ్లీ వ‌ర్ద‌మాన గాయ‌ల‌కు తీసిపోని రీతిలో అద్భుతంగా పాడ‌టాన్ని క్రికెట్ ప్రేమికులే కాదు సినీ ప్రేమికులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : చిరు భేటీపై త‌మ్మారెడ్డి కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!