Viswas Kumar Ramesh: ఎయిరిండియా విమాన ప్రమాదం నుండి బయటపడిన మృత్యుంజయుడు

ఎయిరిండియా విమాన ప్రమాదం నుండి బయటపడిన మృత్యుంజయుడు

Viswas Kumar Ramesh : అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా(Air India) విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణీకులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలట్లు కూడా మృతి చెందారని… ఆ విమానం కూలిన బీజే మెడికల్‌ కాలేజీ యూజీ హస్టల్‌ లంచ్ చేస్తున్న 20 మంది మెడికోలు కూడా మృతి చెందినట్లు అధికారులు భావించారు. దీనికి తోడు విమానం జనావాసా ప్రాంతంలో పడడంతో మృతుల సంఖ్యపై ఇప్పటికింకా స్పష్టత లేదు. అయితే అత్యంత పెద్ద దుర్ఘటన నుంచి ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

Viswas Kumar Ramesh Escaped

అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్(Viswas Kumar Ramesh). భారత సంతతికి చెందిన ఇతడికి బ్రిటన్ పౌరసత్వం ఉంది. భారత్‌ లో ఉంటున్న తన కుటుంబ సభ్యులను కలిసేందుకు అతడు ఇటీవల ఇక్కడి వచ్చాడు. తిరిగి లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కాడు. అతడు తన సోదరుడితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ సోదరుడి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభ్యం కాలేదు. విశ్వాస్ ఎయిరిండియా విమానంలో సీట్ నెంబర్ 11Aలో కూర్చుని ప్రయాణిస్తున్నాడు.

హాస్పిటల్‌ లో చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన విశ్వాస్ ప్రమాదం తర్వాత తన పరిస్థితిని వివరించాడు. ‘నాకు స్పృహ వచ్చే సరికి నా చుట్టూ మృతదేహాలున్నాయి. నాకు చాలా భయం వేసింది. నేను పైకి లేచి పరిగెత్తాను. ఎక్కడ చూసినా విమానం శిథిలాలే కనబడ్డాయి. నన్ను ఎవరో పైకి పట్టుకుని ఆంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు’ అని విశ్వాస్ తెలిపాడు. దీనితో విశ్వాస్ కుమార్ రమేష్ నడిచి వెళ్తున్న విజువల్స్ తో పాటు అతని ఫ్లైట్ టిక్కెట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అతిపెద్ద విషాద ఘటన నుండి బయటపడిన ఏకైక మృత్యుంజయుడిగా విశ్వాస్ కుమార్ రమేష్ ను అభివర్ణిస్తున్నారు.

Also Read : PM Narendra Modi: ఎయిరిండియా విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం

Leave A Reply

Your Email Id will not be published!