K Annamalai : తమిళనాడులో మరాఠా సీన్ ఖాయం – అన్నామలై
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
K Annamalai : తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై(K Annamalai) సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరాఠాలో ఏక్ నాథ్ షిండే శివసేన నుండి బయట పడ్డాడు.
అతను రాజ్ ధర్మాన్ని అనుసరించాడని చెప్పారు. ఇక మరాఠాలో చోటు చేసుకున్న సీన్ తమిళనాడులో కూడా అదే జరుగుతుందని షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కె. అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.
సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి 25 లోక్ సభ సభ్యులు గెలుస్తారని చెప్పారు బీజేపీ చీఫ్ కె. అన్నామలై.
ఈ 25 మంది ఎంపీలు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 150 మంది ఎమ్మెల్యేలతో సమానమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈ కె. అన్నామలై గతంలో ఎస్పీగా పని చేశారు.
అత్యంత నీతి వంతమైన పోలీస్ ఆఫీసర్ గా పేరొందారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఎస్పీ పదవికి గుడ్ బై చెప్పాడు.
ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు తమిళనాడు లో కేవలం అనతి కాలంలోనే కాషాయ జెండా రెప రెప లాడేలా చేశాడు.
ఆపై ఇటీవీల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గణనీయమైన సీట్లు తీసుకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు కె. అన్నామలై(K Annamalai).
ఇదిలా ఉండగా డైనమిక్ లీడర్ గా ఉన్న అన్నామలైని ఏరికోరి బీజేపీ చీఫ్ గా నియమించారు ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా.
Also Read : ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే – స్టాలిన్
Eknath Shinde emerged out of Shiv Sena, he followed 'raj dharma'. It will happen in Tamil Nadu too…We (Tamil Nadu BJP) will get 25 MPs in the Lok Sabha polls, which is equal to 150 MLAs in the Assembly polls in state: Tamil Nadu BJP chief K Annamalai pic.twitter.com/jhKIUjGwFs
— ANI (@ANI) July 5, 2022