Vikas Raj CEO : ప్ర‌తి బూత్ కు వెబ్ కాస్టింగ్ – సిఈవో

అంద‌రి క‌ళ్లు మునుగోడు ఉప ఎన్నిక పైనే

Vikas Raj CEO : దేశ వ్యాప్తంగా ప‌లు చోట్ల ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కానీ ప్ర‌ధానంగా ఫోక‌స్ మాత్రం కేవ‌లం తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నిక‌పైనే ఉంది. ప్ర‌ధాన పార్టీల‌న్నీ హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌చారం చేప‌ట్టాయి. ఇక పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

పెద్ద ఎత్తున మ‌ద్యం, హ‌వాలా రూపంలో డ‌బ్బులు పంపిణీ చేస్తున్నా క‌నీసం స్పందించాల్సిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప‌ట్టించు కోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి పూర్తిగా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ్ర‌హించిన కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏకంగా బ‌దిలీ వేటు వేసింది.

వేరొక‌రికి అప్ప‌గించింది. ఈ చ‌ర్య తీవ్ర దుమారం రేపింది. ఇక రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఉన్న వికాస్ రాజ్(Vikas Raj CEO) తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మునుగోడులో అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఈ మేర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి బూత్ వ‌ద్ద వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఎవ‌రు ఎలాంటి ఇబ్బందులు క‌లిగించినా వెంట‌నే త‌మ‌కు తెలిసి పోతుంద‌న్నారు. ఇందు కోసం సిబ్బందిని ఇప్పటికే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు వికాస్ రాజ్. అన్ని పోలింగ్ బూత్ ల‌కు మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

కాగా మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం రెండు జిల్లాల ప‌రిధిలోకి వ‌స్తుంది. దీంతో ఆయా జిల్లాలు ఎన్నిక‌ల కోడ్ ను స్ప‌ష్టంగా అమ‌లు చేయాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను వికాస్ రాజ్ ఆదేశించారు.

Also Read : బీజేపీ నేత‌ల మాట‌ల‌న్నీ బ‌క్వాస్ – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!