Yogendra Yadav Rahul : రాహుల్ ప‌ప్పు కాదు ద‌మ్మున్నోడు

యోగేంద్ర యాద‌వ్ షాకింగ్ కామెంట్స్

Yogendra Yadav Rahul : ప్ర‌ముఖ సామాజిక‌వేత్త యోగేంద్ర యాద‌వ్(Yogendra Yadav)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ గాంధీ గురించి కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర దేశంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఒక ర‌కంగా నిత్యం చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. దీని వెనుక ప్ర‌ధాన‌మైన వ్య‌క్తి ఉన్నారు. వారెవ‌రో కాదు యోగేంద్ర యాద‌వ్.

ఆయ‌న భార‌త దేశంలో ఎన్న‌ద‌గిన సామాజిక వేత్త‌ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. సామాజిక‌, రాజ‌కీయ‌, సాంస్కృతిక వార‌స‌త్వం అనేది ఒక‌రు ఇస్తే రాద‌ని దానిని మ‌నంత‌కు మ‌న‌మే పొందాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. గ‌త కొంత కాలంగా ఈ దేశంలో మ‌తం రాజ్యం ఏలుతోంది. అది అన్ని రంగాల‌ను శాసిస్తోంది. ఒక ర‌కంగా దేశాన్ని విభ‌జించేలా చేస్తోంది.

దీనిని గుర్తించిన యోగేంద్ర యాద‌వ్(Yogendra Yadav)  త‌న ఆయుధంగా కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. ఆ మేర‌కు రూపొందిందే ఈ భార‌త్ జోడో యాత్ర‌. ఈ సంద‌ర్భంగా యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 2,800 కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచారు.

సెప్టెంబ‌ర్ 6న ప్రారంభ‌మైన ఈ యాత్ర 9 రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీకి చేరుకుంది. ఈ సంద‌ర్భంగా యోగేంద్ర యాద‌వ్ రాహుల్ గాంధీని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న‌ను గ‌త కొంత కాలంగా పప్పు అని సంబంధోస్తూ హేళ‌న చేసిన వాళ్లు ఇప్పుడు వెన‌క్కి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు.

ఆయ‌న ద‌మ్మున్న లీడ‌ర్ గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నార‌ని కితాబు ఇచ్చారు.

Also Read : ఫ్యామిలీ కోస‌మే రాహుల్ యాత్ర‌

Leave A Reply

Your Email Id will not be published!