YS Sharmila : రాష్ట్రంలో అంబేద్క‌ర్ రాజ్యాంగానికి పాత‌ర

సీఎంకు పుస్త‌కాన్ని పంపిన వైఎస్ ష‌ర్మిల

YS Sharmila BR Ambedkar : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ఆమె ఆందోళ‌న చేప‌ట్టారు. సీఎం కేసీఆర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, ప్ర‌జలు స‌మ‌స్య‌లతో అల్లాడుతుంటే సీఎం ఫామ్ హౌస్ కే ప‌రిమితం కావ‌డం దారుణ‌మ‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ను ఎద్దేవా చేశారు. ప‌దే ప‌దే 80 వేల పుస్త‌కాల‌ను చ‌దివాన‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న సీఎం ముందుగా డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన భార‌త రాజ్యాంగాన్ని చ‌ద‌వాల‌ని సూచించారు. ఇందు కోసం తాను పుస్త‌కాన్ని పంపుతున్నాన‌ని చెప్పారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో భార‌త రాజ్యాంగం అమ‌లు కావ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేవ‌లం క‌ల్వ‌కుంట్ల కుటుంబ రాజ్యాంగ‌మే న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఏ మాత్రం చిత్త‌శుద్ది ఉన్నా వెంట‌నే అంబేద్క‌ర్ ఆశ‌యాల సాధ‌న‌కు కృషి(YS Sharmila BR Ambedkar) చేయాల‌న్నారు.

నియంత పాల‌న మానుకోవాల‌ని, ప్ర‌జ‌ల‌కు, ప్ర‌తిప‌క్షాల‌కు మాట్లాడే, పోరాడే స్వేచ్ఛ క‌ల్పించాల‌ని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డంలో కేసీఆర్ నెంబ‌ర్ 1 గా మారారంటూ ఆరోపించారు.

Also Read : బాబు కామెంట్స్ పై కొడాలి క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!