YS Sharmila KCR : ‘సారు..కారు’..అప్పుల్లో షికారు – ష‌ర్మిల‌

నిప్పులు చెరిగిన వైఎస్స్ఆర్ టీపీ చీఫ్

YS Sharmila KCR : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆమె గ‌త కొంత కాలంగా సీఎం కేసీఆర్, కొడుకు కేటీఆర్, కూతురు క‌విత‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఆపై క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ఏ ర‌కంగా దోచుకుంటుందో వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చేప‌ట్టిన ప్ర‌జా యాత్ర‌ను కావాల‌ని బీఆర్ఎస స‌ర్కార్ అడ్డుకుంద‌ని ఆరోపించారు.

తాజాగా ట్విట్ట‌ర్ వేదిక‌గా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఓ వైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అల్లాడుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పోస్టు కూడా నింపిన పాపాన పోలేద‌న్నారు. అభివృద్దిలో పోటీ ప‌డాల్సిన సీఎం సారు..ఆయ‌న కారు..అప్పులు , అత్యాచారాలు, రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, మాన‌వ అక్ర‌మ ర‌వాణాలో, మ‌ద్యం అమ్మ‌కాల్లో, డ్ర‌గ్స్ స‌ర‌ఫరాలో, అవినీతి, అక్ర‌మాల్లో ముందుకు దూసుకు పోతోందంటూ ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila).

ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం విడి పోయిన స‌మ‌యంలో మిగులు బ‌డ్జెట్ ఉంద‌న్నారు. రూ. 16 వేల మిగులు బ‌డ్జెట్ రాష్ట్రాన్ని ఈ ఎనిమిద‌న్న‌ర ఏళ్ల కాలంలో ఏకంగా రూ. 4 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌కు తీసుకు వెళ్లిన ఘ‌న‌త ఈ సీఎం కేసీఆర్(CM KCR) కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు.

అప్పులు ఎవ‌రి కోసం తీసుకు వ‌చ్చారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త కేసీఆర్ కు లేదా అని ఆమె ప్ర‌శ్నించారు. వేల కోట్ల రూపాయ‌లు ఎవ‌రి కోసం తీసుకు వ‌చ్చారు. ఎక్క‌డ ఖ‌ర్చు చేశారో శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని వైఎస్ ష‌ర్మిల డిమాండ్ చేశారు.

Also Read : తార‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే

Leave A Reply

Your Email Id will not be published!