YS Sharmila Tribute : చిర‌స్మ‌ర‌ణీయుడు రాజీవ్ గాంధీ

వైఎస్సార్, రాజీవ్ క‌ల‌లు క‌న్నారు

YS Sharmila Tribute : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila Tribute) దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి రాజీవ్ గాంధీని స్మ‌రించుకున్నారు. ఆయ‌న ఈ దేశం కోసం చేసిన సేవ‌ల‌ను కొనియాడారు. త‌న తండ్రి దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, దివంగ‌త రాజీవ్ గాంధీ అనుకోని ప‌రిస్థితుల్లో దుర్మ‌ర‌ణం పాల‌య్యార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆగ‌స్టు 20న రాజీవ్ గాంధీ జ‌యంతి. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు విన‌మ్రంగా నివాళులు అర్పిస్తున్నాన‌ని తెలిపారు. ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా అరుదైన ఫోటోను పంచుకున్నారు వైఎస్ ష‌ర్మిల‌.

YS Sharmila Tribute to Rajiv Gandhi

వైఎస్సార్ తెలుగు వారి జీవితాల్లో వెలుగులు పంచార‌ని, అట్ట‌డుగున ఉన్న వ‌ర్గాల‌కు ఆలంబ‌న‌గా నిలిచార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఈ దేశానికి దిశా నిర్దేశం చేయ‌డంలో, టెక్నాల‌జీ ప‌రంగా మ‌రింత ముందుకు వెళ్లేలా , దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తీసుకు రావ‌డంలో అవిశ్రాంతంగా కృషి చేశార‌ని దివంగ‌త రాజీవ్ గాంధీని స్మ‌రించుకున్నారు.

వైఎస్సార్ ల‌క్ష‌లాది మంది బ‌తుకుల్లో వెలుగులు నింపార‌ని, రాజీవ్ గాంధీ కోట్లాది ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నం చేశారని ప్ర‌శంసించారు. ప్ర‌ధానంగా రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు. భార‌త దేశం ఉన్నంత వ‌ర‌కు ఈ ఇద్ద‌రు నేత‌ల‌ను ప్ర‌జ‌లు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

Also Read : CM KCR BRS List : గులాబీ ఎమ్మెల్యేల‌లో గుబులు

Leave A Reply

Your Email Id will not be published!