Gautham Vasudev Menon : ఏ మాయ చేసావే మూవీ సీక్వెల్

ప్ర‌క‌టించిన గౌతం వాసుదేవ మీన‌న్

Gautham Vasudev Menon :  భార‌తీయ సినిమా రంగంలో మోస్ట్ పాపుల‌ర్ ద‌ర్శ‌కుల‌లో ఒక‌రు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్(Gautham Vasudev Menon). ఆయ‌న ఏ చిత్రం తీసినా అదో క‌ళా ఖండం లాగా ఉండేలా తీస్తాడు.

తీసుకున్న స‌బ్జెక్టు ఏదైనా చిత్రంలో పాత్ర‌ల‌కు నిండైన వ్య‌క్తిత్వం ఉంటుంది. అంత‌కంటే ఎక్కువ‌గా స్వేచ్ఛ ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు మీన‌న్. భావుక‌త్వం నిండిన ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

ఆయ‌న ఇప్ప‌టికే నాగ చైత‌న్య‌, స‌మంత‌తో క‌లిసి తీసిన ఏ మాయ చేసావే మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ చిత్రంగా నిలిచి పోయింది.

ఇక ఈ సినిమాకు సంబంధించి అందించిన సంగీతం , పాట‌లు టాప్ లో ఉన్నాయి. పిక్చ‌రైజేష‌న్ ఆక‌ట్టుకునేలా ఉండ‌డం, స‌మంత‌ను మ‌రింత అందంగా, ఆక‌ట్టుకునే అమాయ‌క‌త్వంతో కూడుకున్న పాత్ర‌కు ఎంపిక చేయ‌డం గౌతం వాసుదేవ మీన‌న్ కే చెల్లుతుంది.

తాజాగా ద‌ర్శ‌కుడు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. ఆయ‌న తీసిన ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ ఈనెల 17న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా గౌత‌మ్ వాసుదేవ మీన‌న్(Gautham Vasudev Menon) ను ఏ మాయ చేసావే మూవీని సీక్వెల్ తీస్తారా అని అడిగారు.

మీరనుకున్న‌ది నిజ‌మే. నేను ఆ ప‌ని మీదే ఉన్నా. నాగ చైత‌న్య ఓకే చేస్తే స్క్రిప్ట్ రెడీ చేస్తాన‌ని చెప్పారు గౌత‌మ్ వాసుదేవ మీన‌న్. ఇక ఈ సీక్వెల్ లో మాజీ భ‌ర్త‌తో క‌లిసి స‌మంత రుత్ ప్ర‌భు న‌టిస్తుందా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : వాళ్లిద్ద‌రూ విడిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం

Leave A Reply

Your Email Id will not be published!