ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో పరుగుల వరద పారింది. చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన కోల్ కతా 236 రన్స్ టార్గెట్ ను ఛేదించేందుకు ప్రయత్నం చేసింది. జేసన్ రాయ్, రింకూ సింగ్ తప్ప మిగతా ప్లేయర్లు ఎవరూ ఆశించినంత మేర రాణించ లేక పోయారు. దీంతో కోల్ కతా చెన్నై చేతిలో 49 పరగుల తేడాతో ఓటమి పాలైంది.
చెన్నైతో ఆడిన సమయంలో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు జేసన్ రాయ్. 5వ స్థానంలోకి చేరుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 186 రన్స్ కే పరిమితమైంది. జట్టులో మారథాన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు జేసన్ రాయ్. 26 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు , 5 సిక్స్ లతో రెచ్చి పోయాడు. మొత్తం 61 పరగులు చేశాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
అనంతరం రింకూ సింగ్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రింకూ సింగ్ 33 బాల్స్ ఎదుర్కొని 3 ఫోర్లు 4 సిక్స్ లతో 53 పరుగులు చేశాడు. నాటౌట్ గా నిలిచాడు రింకూ సింగ్.