ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్న ముంబై క్రికెటర్ , భారత క్రికెట్ జట్టు మాజీ స్కిప్పర్ అజింక్యా రహానే దుమ్ము రేపుతున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ చుక్కలు చూపిస్తున్నాడు. ప్రత్యర్థి జట్లకు తన బ్యాటింగ్ తో వార్నింగ్ ఇస్తున్నాడు. సంప్రదాయ ఆటకు భిన్నంగా యువ ఆటగాళ్లు సైతం విస్తు పోయేలా రహానే దంచి కొట్టడం విస్తు పోయేలా చేస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. డేవాన్ కాన్వే 56 రన్స్ చేస్తే రుతురాజ్ 30 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత మైదానంలోకి దిగిన శివమ్ దూబే, అజింక్యా రహానే చుక్కలు చూపించారు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టారు.
రహానే కేవలం 29 బంతులు ఎదుర్కొని 71 రన్స్ చేశాడు. చివరి దాకా ఉన్నాడు. భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ లలో 52.25 సగటుతో 209 పరుగులు చేశాడు రహానే. 199.04 స్ట్రైక్ రేట్ సాధించాడు. అద్భుత ఇన్నింగ్స్ మెరిసిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రహానే తన జట్టు స్కిప్పర్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ చెప్పింది చేస్తే చాలు మన పని సులువవుతుందన్నాడు. అంతే కాదు ధోనీ చెప్పింది వింటున్నానని, ఆటను ఆస్వాదిస్తున్నట్లు చెప్పాడు అజింక్యా రహానే.