Uttam Kumar Reddy : అబ‌ద్దాల‌కోరు కేసీఆర్ – ఉత్త‌మ్

మాజీ పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Uttam Kumar Reddy : టీపీసీసీ మాజీ చీఫ్ , ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అబ‌ద్దాల‌కు కేరాఫ్ సీఎం కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌ను ఇవ్వ‌డంలో త‌న‌కు మించిన నాయ‌కుడు ఈ దేశంలో ఎవ‌రూ లేర‌న్నారు.

Uttam Kumar Reddy Slams CM KCR

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ పాల‌న మొత్తం ఫామ్ హౌస్ కే ప‌రిమిత‌మైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సిన ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ స‌ర్కార్ కు షాక్ ఇవ్వ‌క త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసి కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో కాలం వెళ్ల‌బుచ్చుతున్న సీఎంకు త‌గిన రీతిలో గుణ పాఠం చెప్పేందుకు జ‌నం సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

తాము కేసీఆర్ లాగా మోసానికి పాల్ప‌డ లేద‌ని అన్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే క‌ర్ణాట‌క‌లో ఇచ్చిన ఐదు హామీల‌ను అమ‌లు చేసేందుకు కృషి చేస్తున్నామ‌ని ఇది త‌మకు ఉన్న నిబ‌ద్ద‌త అని స్ప‌ష్టం చేశారు.

Also Read : India Fight : మోదీ ప్ర‌భుత్వం పై ఇండియా యుద్దం

Leave A Reply

Your Email Id will not be published!