అసెంబ్లీ ఎన్నికలు భావోద్వేగంతో కూడుకున్న‌వి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన టీవీకే చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్

చెన్నై : ఓ వైపు ఆస్తుల వివాదాలు ఇంకో వైపు కేసుల ప‌రంపర కొన‌సాగుతున్న త‌రుణంలో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి గురైన ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం దేశ వ్యాప్తంగా హోళీ పండుగ‌ను జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ పెట్టిన స‌మ‌యంలోనే తాను ఇవ‌న్నీ వ‌స్తాయ‌ని త‌న‌కు తెలుస‌ని అన్నాడు. అన్నింటిని ఎదుర్కొనే స‌త్తా త‌న‌కు ఉంద‌న్నాడు. అందుకే తాను ఇప్పుడు ఏమీ మాట్లాడ‌బోనంటూ ప్ర‌క‌టించాడు. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే శాస‌న స‌భ ఎన్నిక‌లు అత్యంత కీల‌క‌మ‌ని, త‌న‌కే కాదు త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కూడా అని ప్ర‌స్తావించాడు విజ‌య్.

ఈ సంద‌ర్బంగా శాస‌న స‌భ ఎన్నిక‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నాకు ‘ భావోద్వేగం’ అని నటుడు విజయ్ పిటిఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఇతరులకు ఇది సాధారణ ఎన్నికలా అనిపించవచ్చు, కానీ నాకు, నన్ను ప్రేమించే ప్రజలకు ఇది ఒక భావోద్వేగంతో కూడుకుని ఉన్న అంశమ‌ని, అంత‌కంటే ఎక్కువేన‌ని స్ప‌ష్టం చేశారు విజ‌య్. ఇక్క‌డ ఇవాళ జ‌రిగిన పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించారు టీవీకే చీఫ్ విజ‌య్. రాబోయే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల చిహ్నం “విజిల్” తమిళనాడు అంతటా ప్రతి ఇంట్లో , ప్రతి పోలింగ్ బూత్‌లో ప్రతిధ్వనించాల‌ని పిలుపునిచ్చారు.
ఇదే క్ర‌మంలో మ‌రోసారి విజ‌య్ అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఏకి పారేశారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చ‌రిల్లి పోయింద‌ని ఆరోపించారు. అదో దుష్ట శ‌క్తి అని, దానిని త‌రిమి కొట్టాల‌ని కోరారు.

Leave A Reply

Your Email Id will not be published!