న్యూఢిల్లీ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవలే ఒక్కటయ్యారు. స్వంతంగా గృహ ప్రవేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తమ పెళ్లికి, రిసెప్షన్ కు రావాలంటూ కోరారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉండగా తనను కలిసినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు మోదీ. బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియ చేస్తూ లేఖ పంపించారు. ఈ విషయాన్ని స్వయంగా పీఎంఓ స్పష్టం చేసింది.
విజయ్ దేవరకొండ కుటుంబానికి అధికారిక ప్రశంసా లేఖను పంపింది. ఈ సంజ్ఞ నటుడి బృందం, కుటుంబ సభ్యులను ఆనంద పరిచింది. దేవరకొండ నివాసానికి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా లేఖ కాపీని కూడా పంపింది. ఈ లేఖ ఇవాళ హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని కుటుంబం ఉంటున్న ఇంటికి చేరింది. అరుదైన గుర్తింపుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నటుడి పీఆర్ బృందం ఆన్లైన్లో నవీకరణను పంచుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందుకోవడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించ బడుతుంది, ఫిబ్రవరి 26న జరిగిన ఈ ప్రముఖ జంట వివాహం మరింత చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ సందర్బంగా తమకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.
