Jagga Reddy : ఓడినా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తా

మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి కామెంట్స్

Jagga Reddy : సంగారెడ్డి – తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో చింతా ప్ర‌భాక‌ర్ చేతిలో అనూహ్యంగా ఓట‌మి పాలైన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి(Jagga Reddy) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాను 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాన‌ని అన్నారు. ఇందులో మూడుసార్లు త‌న‌ను ఎమ్మెల్యేగా ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గెలిపించార‌ని , త‌న‌ను ఎంతో కాలంగా ఆద‌రిస్తూ వ‌చ్చార‌ని కొనియాడారు. ఎన్నిక‌లు అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్నారు.

Jagga Reddy Comment

ఎవ‌రికి వేయాల‌ని అనుకున్నారో వారినే గెలిపిస్తార‌ని , కానీ ఓట‌ర్ల‌ను నియంత్రించ లేమ‌న్నారు. తాను ఓడి పోయినందుకు త‌న‌కు బాధ క‌లిగించ‌డం లేద‌న్నారు. అయితే అనూహ్యంగా త‌మ పార్టీ 10 ఏళ్ల త‌ర్వాత అధికారంలోకి రావ‌డం సంతోషం క‌లిగిస్తోంద‌ని చెప్పారు జ‌గ్గారెడ్డి.

గ‌తంలో కంటే ఈసారి ఎన్నిక‌ల్లో తాను ఎక్కువ‌గా నేర్చుకున్నాన‌ని, ఇది ఒక ర‌కంగా గొప్ప పాఠంగా మిగిలి పోతుంద‌ని పేర్కొన్నారు. బ‌ల‌వంతుడైన వ్య‌క్తి ఏదో ఒక రోజు ఈ భూమి మీద బ‌ల‌హీనుడు కాక త‌ప్ప‌ద‌న్నారు. సీఎం కేసీఆర్ కూడా కామారెడ్డిలో ఓడి పోయాడ‌ని జ‌నమే అంతిమ న్యాయ నిర్ణేత‌లంటూ స్ప‌ష్టం చేశారు జ‌గ్గారెడ్డి. ఓడి పోయినా తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటానని, వారి కోసం ప‌ని చేస్తాన‌ని చెప్పారు.

Also Read : MLC Kavitha : త‌మిళి సై కామెంట్స్ క‌విత సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!