YS Jagan Guntur Visit :మాజీ సీఎం గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు

జగన్‌కు రెడ్ బుక్ ఫోబియా పట్టుకుందన్నారు...

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను కలిశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉందని, మిర్చియార్డులోకి అనుమతి లేదని అధికారులు చెప్పినప్పటికీ లెక్క చేయకుండా ప్రవర్తించారు జగన్(YS Jagan). అంతేకాకుండా ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. దీంతో జగన్ మిర్చియార్డు పర్యటనపై రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం గుంటూరు మిర్చి యార్డు పర్యటన పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో 14 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

YS Jagan Guntur Visit..

రైతుల ఆత్మహత్యలో దేశంలో ఏపీని మూడో స్థానంలో జగన్ నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా… జగన్ మిర్చి యార్డుకి వెళ్లారన్నారు. దుర్మార్గమైన కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చెయ్యాలని చూస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వంలో నిలిపేసిన పోలవరం పనులు సీఎం చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని తెలిపారు. దళితుడు సత్యవర్ధన్‌పై దాడి ఘటనలో నిందుతుడైన వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారని.. పోలీసులను, అధికారులను భయపెట్టే విధంగా జగన్ మాట్లాడారని అన్నారు. ఐదేళ్లు చేసిన దుర్మార్గ కార్యక్రమాల వల్లే బట్టలు ఊడదీసి 11 సీట్లు ఇచ్చారని.. ఇలాగా ఉంటే 11 సీట్లు కూడా రావంటూ ఎద్దేవా చేశారు.

జగన్‌కు రెడ్ బుక్ ఫోబియా పట్టుకుందన్నారు. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నాయకులకు తడిసిపోతుందన్నారు. రెడ్ బుక్ తెరిస్తే ప్రభుత్వం వచ్చిన నెలలోనే వైసీపీ నాయకులు ఇళ్లలో ఉండేవాళ్లు కాదన్నారు. జీవితాన్ని ఇచ్చిన తెలుగు దేశం పార్టీ కార్యాలయాన్ని వంశీ తగులబెట్టారని విమర్శించారు. సత్యవర్థన్‌ను వంశీ, ఆయన అనుచరులు బెదిరించి తీసుకువెళ్తున్న వీడియోలు బయటకు వచ్చాయన్నారు. మద్యం విధానంలో దందాలు చేసి తాడేపల్లి ప్యాలెస్‌కు లక్ష కోట్లు నిధులు మళ్లించారని ఆరోపించారు. మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ వేస్తే… తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఫైల్స్ అన్నీ తగులబెట్టారన్నారు. జగన్ అక్రమ మద్యం విధానం వల్ల లక్షల మంది లివర్, కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారని వెల్లడించారు.జగన్ విపరీతంగా మద్యం ధరలు పెంచడంతో నాటు సారాకు అలవాటుపడ్డారన్నారు. నాటు సారా నివారణ కోసం నవోదయం కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఐదేళ్ల దోపిడీ కోసం జగన్ పాలసీ తీసుకువస్తే… ప్రజల ఆరోగ్యం కోసం ఎక్సైజ్ పాలసీ తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) వెల్లడించారు.

Also Read : CM Chandrababu : కేంద్రమంత్రికి మిర్చి కొనుగోలు పై లేఖ రాసిన సీఎం చంద్రబాబు

Leave A Reply

Your Email Id will not be published!