Acharya Movie : మెగా ఫ్యాన్స్ కు ఖుష్ క‌బ‌ర్

ఏప్రిల్ 1న ఆచార్య మూవీ రిలీజ్

Acharya Movie :నిన్న‌టి దాకా ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన మెగా అభిమానుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పింది ఆచార్య మూవీ (Acharya Movie )యూనిట్. క‌రోనా కేసుల‌తో పాటు ఓమిక్రాన్ కొత్త కేసులు పెరుగుతుండ‌డంతో ముందు జాగ్ర‌త్తగా జ‌క్క‌న్న తీసిన ఆర్ఆర్ఆర్, రాధాకృష్ణ కుమార్ తీసిన ప్ర‌భాస్ , పూజా న‌టించిన రాధే శ్యామ్ మూవీస్ విడుద‌ల వాయిదా వేశారు.

ఈ త‌రుణంలో డైన‌మిక్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్, రామ్ చ‌ర‌ణ్, పూజా హెగ్డే క‌లిసి న‌టించిన ఆచార్య(Acharya Movie )ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అభిమానులు అంతా సంక్రాంతి పండ‌గ‌కే వ‌స్తుంద‌ని ఆశించారు. వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ఫెస్టివ‌ల్ రోజున ఇప్ప‌ట్లో చెప్ప‌లేమంటూ ప్ర‌క‌టించి నిరాశ‌కు గురి చేశారు.

ఈ త‌రుణంలో ఇవాళ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. తాజాగా మూవీకి సంబంధించి అప్ డేట్ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 1న ఆచార్య చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్, టీజ‌ర్, సాంగ్స్ కు భారీ స్పంద‌న లభించింది. ఆచార్య‌కు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఇక కొర‌టాల శివ అంటేనే ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ దాగి ఉంటుంది. ఇందులో భాగంగా ఆయ‌న తీసే ప్ర‌తి మూవీలో ఏదో ఒక సందేశం ఇమిడి ఉంటుంది.

శివ ప్ర‌భాస్ తో తీసిన మిర్చి, మ‌హేష్ బాబుతో తీసిన చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇక మెగాస్టార్ తో తీసిన ఈ ఆచార్య‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. విడుద‌లైతే కానీ ఏమిట‌నేది తేలుతుంది.

Also Read : పాలిటిక్స్ వ‌ద్దు మూవీస్ ముద్దు

Leave A Reply

Your Email Id will not be published!