Ravindra Jadeja : జ‌ట్టులోకి వ‌స్తాన‌ని అనుకోలేదు

ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్ట‌రాని సంతోషం

Ravindra Jadeja : భార‌త జ‌ట్టు క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్ట‌రాని సంతోషంతో ఉన్నాడు. చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు స్వ‌దేశంలో శ్రీ‌లంక‌తో ఆడ‌నుంది.

ఇప్ప‌టికే టీమిండియా టీ20, వ‌న్డే సీరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఫుల్ జోష్ లో ఉంది. భార‌త క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ ఊహించ‌ని రీతిలో రవీంద్ర జ‌డేజాకు మ‌రోసారి ఛాన్స్ ఇచ్చింది.

తాను మ‌ళ్లీ వ‌స్తాన‌ని అనుకోలేద‌న్నాడు ఈ స్టార్ ప్లేయ‌ర్. రెండు నెల‌ల త‌ర్వాత మైదానంలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. త‌న శ‌క్తియుక్తుల‌ను ధార పోసి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తాన‌న్నాడు జడేజా(Ravindra Jadeja).

కీవీస్ టూర్ తో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో సౌతాఫ్రికా టూర్ కు వెళ్ల లేక పోయాడు. ఇక బెంగ‌ళూరులో జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలంలో మ‌నోడు కూడా ఉన్నాడు.

ఇక గాయం న‌యం కావ‌డంతో జాతీయ క్రికెట్ అకాడ‌మీ రిహాబిలిటేష‌న్ కేంద్రంలో పూర్తి చికిత్స తీసుకున్నాడు. అక్క‌డ వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా ప్రాక్టీస్ చేశాడు.

చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ త‌న స‌హ‌చ‌రుల‌ను క‌లుసు కోవ‌డంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యాడు. ఎంపిక చేసిన కొత్త జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ సెష‌న్ లో నిమ‌గ్నం అయ్యాడు.

ఇక శ్రీ‌లంక‌తో 24న టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ర‌వీంద్ర జ‌డేజాతో పాటు ఉప సార‌థి జ‌స్ ప్రీత్ బుమ్రా కూడా జ‌ట్టులోకి రానున్నాడు. శ్రీ‌లంక ఆసిస్ తో పోయిన ప‌రువును భార‌త్ పై గెలిచి కాపాడు కోవాల‌ని చూస్తోంది.

Also Read : స్ట‌న్నింగ్ క్యాచ్ తో మెరిసిన మంధాన‌

Leave A Reply

Your Email Id will not be published!